కాసేప‌ట్లో తెలంగాణ డీఎస్‌సీ ఫ‌లితాల విడుద‌ల‌

తెలంగాణలో టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీ కోసం నిర్వ‌హించిన డీఎస్‌సీ ప‌రీక్ష ఫ‌లితాలు నేడు విడుద‌ల కానున్నాయి. ఫ‌లితాల‌ను సీఎం రేవంత్ రెడ్డి స‌చివాల‌యంలో ఇవాళ ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్నారు. 11,062 పోస్టుల భ‌ర్తీకి జులై 18 నుంచి ఆగ‌స్టు 5వ తేదీ వ‌ర‌కు డీఎస్‌సీ ప‌రీక్ష‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. మొత్తం 2.45ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు ఈ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యారు.

DSC Results
Revanth Reddy
Telangana

More Telugu News